Breaking News
Loading...
Sunday, May 11, 2014

Info Post


విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం విశాఖపట్నం వచ్చి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. తమ భేటీలో రాజకీయం ఏమీ లేదన్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు విశాఖపట్నం వచ్చానని, గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించడంతో మర్యాదపూర్వకంగా వచ్చానన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఓటింగ్ సరళి తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది.

0 comments:

Pages