Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post


మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి నటించిన ‘మనం ’ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే విషయం చిత్ర యూనిట్ తో పాటు, నాగార్జున కూడా చెప్పుకొచ్చాడు. తీరా సెన్సార్ రిపోర్ట్ వచ్చిన తరువాత తెలిసింది ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదని. ఎందుకంటే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ యు/ఎ ’ సర్టిఫికేట్ ప్రదానం చేసింది.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రానికి క్లీన్ ‘యు ’ సర్టిఫికెట్ రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరుకు కుటుంబ కథా చిత్రం అయినా, హీరో నాగచైతన్య, సమంతా మధ్యన మాంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉండటమే కాకుండా, తండ్రీ కొడుకులు కలిసి మందుకొట్టే సన్నివేశాలు పెట్టడం వల్లే సెన్సార్ బోర్డు వాళ్ళు యు/ఎ ఇచ్చేశారని అంటున్నారు. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను పిల్లలతో కలిసి చూద్దామన్న ప్రేక్షకులకు సెన్సార్ బోర్డు ఇచ్చిన షాక్ తో నిరాశ తప్పేలా లేదు.

ఇక ఈ సినిమాకు ఎన్నో అదనపు హంగులు పెట్టారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ పోషిస్తుండగా, శ్రియా, సమంతా హీరోయిన్లుగా నటించిగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నారు.

0 comments:

Pages