Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post

పరాయి గడ్డ పై, సొంత గడ్డ పై ఆరంభంలో తడబడిన కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇటీవలే పుంజుకొని వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముంబయి పై గెలించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకోవడమే కాకుండా, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ముఖ్యంగా ఉతప్ప వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాను గెలిపించాడు.

బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి, 141 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ శర్మ (45 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాయుడు (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.

ముంబై ఉంచిన లక్ష్యాన్ని కోల్ కత్తా కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేధించింది. తప్ప (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఉతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

0 comments:

Pages