Breaking News
Loading...
Wednesday, May 14, 2014

Info Post

తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. పని జరుగుతూ వుండగా వేడి నీరు మీద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురు సంస్థ ఉద్యోగులు. ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు. అయితే ఈ ఆరుగురికి చిన్నపాటి కాలిన గాయాలు అయ్యాయి తప్ప ప్రాణాపాయం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అంటే ఏం జరిగిందో అని ప్రజలు భయపడతారని, అయితే ఇక్కడ జరిగింది అణు ధార్మికతకు సంబంధించిన ప్రమాదం కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.

0 comments:

Pages